Header Ads

రైతుల అకౌంట్లలోకి రూ.12,000.. మీకు రాకపోతే వెంటనే ఇలా చేయండి!

 

farmers
పీఎం కిసాన్ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది. అన్నదాతలకు ఆర్థికంగా చేయూత అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ఆవిష్కరించింది. ఈ స్కీమ్‌లో చేరిన రైతులు ఏడాదికి రూ.6,000 పొందొచ్చు. ఇది మూడు విడతల్లో రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి వచ్చి చేరుతుంది.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరు విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసింది. అంటే ఒక్కో రైతు బ్యాంక్ అకౌంట్‌లోని కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ.12,000 వచ్చాయి. ఇప్పుడు మోదీ సర్కార్ ఏడో విడత డబ్బులను రైతులకు అందించేందుకు రెడీ అవుతోంది.


అయితే కొంత మంది రైతులకు ఇంకా పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు రావడం లేదు. స్కీమ్ కోసం అప్లై చేసుకున్నా కూడా డబ్బులు మాత్రం అకౌంట్‌లో జమకావడం లేదు. ఇలా జరగడానికి కొన్ని పొరపాట్లు కారణం. రైతులు పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు పొందాలని భావిస్తే.. కచ్చితంగా బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి.

బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్ లింక్ అయిన రైతులకు పీఎం కిసాన్ డబ్బులు వస్తున్నాయి. ఇవి లింక్ కాని అన్నదాతలకు మాత్రం రూ.2,000 రావడం లేదు. అందువల్ల మీరు కూడా వెంటనే బ్యాంక్‌కు వెళ్లి ఆధార్‌ను లింక్ చేసుకోండి. మోదీ అందిస్తున్న కిసాన్ స్కీమ్ డబ్బులు పొందండి.

అయితే రైతులు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బ్యాంక్ అకౌంట్‌లో వివరాలు, ఆధార్ కార్డులో వివరాలు రెండూ కరెక్ట్‌‌గా ఉండాలి. లేదంటే ఇవి లింక్ కాకపోవచ్చు. మీరు బ్యాంక్ బ్రాంచుకు వెళ్లకుండా ఆన్‌లైన్‌లో కూడా ఈ పని పూర్తి చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు.

No comments

Powered by Blogger.